Showing posts with label Telugu Film News. Show all posts
Showing posts with label Telugu Film News. Show all posts

Thursday, February 23, 2012

mahesh-babu-uses-beauty-secret


మహేష్ బాబు గ్లామర్ రహస్యం ఇదే...


సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లామర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. 40 సంవత్సరాల వయసుకు చేరువవుతున్నా...ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా నవనవలాడుతుంటారు. మహేష్ బాబు గ్లామర్‌కి ఎంతటి అందగత్తెలాంటి హీరోయిన్ అయినా దిగదుడుపే అని స్వయంగా పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు కూడా. ఆయన గ్లామర్ రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి చాలా మంది చాలా సార్లు ప్రత్నించారు కానీ వీలు కాలేదు. ఆయన గ్లామర్ కోసం స్కిన్ తెరపీ చేయించుకున్నారని, ప్రత్యేకంగా మందులు వాడుతారనే ప్రచారం కూడా ఉంది.

తాజాగా తన గ్లామర్ రహస్యం ఏమిటో స్వయంగా వెల్లడించాడు మహేష్ బాబు. ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ...ఇందులో దాచాల్సింది ఏమీ లేదని, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటే గ్లామర్ దానంతట అదే వస్తుందని చెప్పకొచ్చారు. వీలనంత వరకు కోపాన్ని తగ్గించుకోవాలని, దురలవాట్లకు దూరంగా ఉండాలని, ఇలా చేస్తే ఎవరైనా సరే ఆరోగ్యంగా, అందంగా ఉంటా మహేష్ బాబు చెప్పారు.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. దిల్ రాజు నిర్మాత.

nitin-about-his-film-ishq


నా ఆరోగ్యం సహకరించకపోయినా...నితిన్


అప్పుడు నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు. అయినా... పట్టుబట్టి నాతో పాడించాడు. ఈ పాటకు లభించిన స్పందన చూశాక ఎంతో ఆనందం కలిగింది అంటున్నారు నితిన్. ఆయన తన తాజా చిత్రం ఇష్క్‌ లో ఓ పాట పాడారు. ఆ పాట గురించి మీడియా వారు అడిగితే ఇలా స్పందించారు. అలాగే...పాడటం నాకు అస్సలు రాదు. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ బలవంతం చేయడంతో లచ్చువమ్మ... పాట పాడాను. కృష్ణచైతన్య ఆ పాట రాస్తున్నప్పుడు నేను కూడా పక్కనున్నాను. సరదాగా పాటని హమ్‌ చేస్తూ తిరుగుతున్నాను. అక్కడే ఉన్న అనూప్‌ రూబెన్స్‌ 'నువ్వు పాడుతుంటే బాగుంది. ప్రయత్నించొచ్చు కదా?' అన్నాడు.

ఇక వరస ప్లాప్ ల గురించి మాట్లాడుతూ...సినిమా జయాపజయాల వెనుక రకరకాల కారణాలుంటాయి. కానీ నేను పడే కష్టం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మంచి కథల్నే ఎంచుకొంటున్నాను. కానీ అవి చివరికి సరైన ఫలితాల్ని ఇవ్వలేకపోయాయి. 'ఇష్క్‌' కోసం మరింత కసితో పనిచేశాను. ఈ సినిమా తప్పకుండా ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నా అన్నారు. ఇక హీరోలంతా స్పీడు పెంచారు. వరుసగా సినిమాలు చేయడం అందరికీ మంచిదే. ఇదివరకు నేనూ అలాగే చేశాను. కొన్ని రోజులుగా నా కెరీర్‌లో వేగం తగ్గిందంతే. మంచి కథలు దొరికితే నేనూ వరుసగా సినిమాలు చెయ్యాలనుకొంటున్నా అని చెప్పుకొచ్చారు. నితిన్‌ హీరోగా నటించిన చిత్రం 'ఇష్క్‌'. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Tuesday, February 21, 2012

Amala-paul-with-ram-charan


రామ్ చరణ్ సరసన...నాగచైతన్య హీరోయిన్

 

నాగచైతన్య సరసన బెజవాడ చిత్రంలో నటించిన అమలాపౌల్ కి తెలుగులో మరో ఆఫర్ వచ్చింది. రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో ఆమెను సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వినాయిక్ ఆమె చిత్రాలు చూసి ఇంప్రెస్ అయ్యి మరీ ఆమెను తన చిత్రంలోకి తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకొంటున్నారో బాగా తెలిసిన దర్శకుడు వి.వి.వినాయక్‌. అటు మాస్‌నీ, ఇటు యువతనీ సమంగా మెప్పిస్తారు. పూర్తిస్థాయి మాస్‌ అంశాలున్న చిత్రమిది. నా పాత్ర భిన్న కోణాల్లో కనిపిస్తుంది. మగధీర తరవాత కాజల్‌తో చేస్తున్న చిత్రమిది. చక్కటి సంగీతం తోడైందని అన్నారు.

వివి వినాయిక్ మాట్లాడుతూ..మా చిత్రం చాలా బలమైన కథతో రూపుదిద్దుకొంటోంది. చిరంజీవి అభిమానులు ఆశించే అన్ని హంగులూ ఉంటాయి. ఇప్పుడు చిత్రిస్తున్న ఫైట్స్ కథలో చాలా కీలకమైనవి అన్నారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌ పాతబస్తీలో కీలక పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

mahesh-babu-happy-mood


నేను చేసిన పొరపాట్ల వల్లే... మహేష్ బాబు


ఇప్పుడంటే ఓకేగానీ... ఒకప్పుడు నాలో కొద్దిగా కన్‌ఫ్యూజన్‌ ఉండేది. 'రౌండప్‌ చేసి నన్ను కన్‌ఫ్యూజ్‌ చెయ్యొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను' అని బిజినెస్‌మేన్‌లో ఓ డైలాగ్‌. సినిమాల్లో నన్ను కన్‌ఫ్యూజ్‌చేసే, టెన్షన్‌పెట్టే విలన్లు ఉన్నారుగానీ... నిజజీవితంలో మాత్రం అలా ఎవ్వరూ లేరు. కన్‌ఫ్యూజనంతా నేను చేసిన పొరపాట్ల వల్లే. అది కూడా ఇప్పుడు పోయింది. క్లారిటీ వచ్చింది అంటున్నారు మహేష్ బాబు. బిజినెస్ మ్యాన్ చిత్రం విజయోత్సాహంలో ఉన్న మహేష్ బాబు తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే...నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఫేజ్‌ ఇది. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. అందుకు కారణం... దూకుడు, బిజినెస్‌మేన్‌ సినిమాలే. వాటి భారీ విజయాలు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. 'ఒక్కసారి కమిటయితే నామాట నేనే వినను' - 'పోకిరి'లోని ఈ డైలాగు నాకు చాలా బాగా సరిపోతుంది. నేనొక నిర్ణయం తీసుకున్నానంటే దానికే కట్టుబడతాను. 'మనం చేసే పనివల్ల మనకు ప్రయోజనం ఉండాలి. ఎదుటివారికి ఇబ్బంది కలగకూడదు...' - ఇదీ నా ఫిలాసఫీ. దీన్నే ఫాలో అవుతాను అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ...సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంతో పాటు సుకుమార్ దర్సకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు.

magadheera-scenes-rachcha


రచ్చలో మగధీర హైలెట్ సీన్


రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం మగధీర. ఆ చిత్రంలోని హైలెట్ సీన్ అయ్యిన వందమందిని నరికే సీన్ తరహా సన్నివేశం ఒకటి రచ్చలో రిపీట్ అవుతోందంటూ వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే అవి రూమర్స్ అని కొట్టి పారేస్తున్నా... అలాంటి ఎమోషన్ ని రిపీట్ చేస్తూ అంతమందిని ఒక్కసారిగా హీరో ఎదుర్కొనే సన్నివేశం మాత్రం ఉందని చెప్పుకుంటున్నారు.

ఇక రచ్చలో యాక్షన్ సీన్సే హైలెట్ కానున్నాయని సమాచారం. రామ్ చరణ్,తమన్నా కాంబినేషన్ లో సంపత్ నంది రూపొందిస్తున్న చిత్రం రచ్చ. ఈ చిత్రంలో హీరో.. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. అడ్డొస్తే... ఇక రచ్చ రచ్చే. ఇలాంటి మనస్తత్వం ఉన్న కుర్రాడే కథే రచ్చ. అతను సృష్టించిన హంగామా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొంత కాలం ఆగాలి. ఎన్వీ ప్రసాద్‌, పారాస్‌జైన్‌ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్‌, ఛాయాగ్రహణం:సమీర్‌ రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.

Allari-naresh-socio-fantasy-flick-from-mar-17


గ్రాఫిక్స్ హైలెట్ గా అల్లరి నరేష్ సినిమా


అల్లరి నరేష్ కథానాయకుడిగా సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై నిర్మాత చంటి అడ్డాల ఓ సోషియో ఫాంటసీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వినోద భరిత చిత్రం షూటింగ్ మార్చి 17న ప్రారంభం కానుంది. నరేస్ కెరీర్లోనే తొలిసారి అత్యధిక బడ్జెట్ తో రూపొందబోయే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ చిత్రం కోసం గ్రాఫిక్స్ వర్క్ నిర్మాణానికి ముందు నుంచే మొదలు పెట్టామని ఆయన తెలిపారు. సాధారణంగా షూటింగ్ పార్ట్ పూర్తయిన తర్వాత గ్రాఫిక్స్ పనులకు శ్రీకారం చుడతారని, అయితే ఈ చిత్రం కోసం తాము ముందే గ్రాఫిక్స్ పనులను ఆరంభించడం ఓ విశేషమని అన్నారు. అలానే భారీ సెట్స్ కూడా చిత్రానికి మరో ఆకర్షణ అవుతాయని, సంగీతానికి కూడా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.

ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సుమన్, సురేష్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, షియాజీ షిండే, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు, చలపతిరావు, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి, ఛాయాగ్రహణం: కె.రవీంద్రబాబు, ఎడిటింగ్: గౌతంరాజు, కిరణ్ కుమార్, నిర్మాత: చంటి అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సత్తిబాబు

Its-just-kiss-kajal


‘మహేష్ కు, నాకు కామన్...ఎక్కువ చేయొద్దు’


బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబు-కాజల్ మధ్య ముద్దు సీన్ సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇప్పటి మహేష్ బాబు ఏ హీరోయిన్ తోనూ అంత ఘాటుగా, అంత రొమాంటిక్ గా ముద్దు పెట్టుకోలేదు. ఈ విషయాన్ని ఇటీవల మరోసారి కాజల్ వద్ద ప్రస్తావించగా ఇలా స్పందించింది. ‘‘మహేష్ బాబు, నేను ప్రొఫెషనల్ నటులం, మా ఇద్దరి మధ్య అది కేవలం సినిమా ముద్దు మాత్రమే, మా ప్రొఫెషన్లో ఇవన్నీ కామన్, సీన్ డిమాండ్ చేసింది కాబట్టే ఆ సీన్ ఉంది, అంతే కాని దీనిపై ఎక్కువ చేయొద్దు, టూమచ్ గా చూడొద్దు’’ అంటూ స్పందించింది.

బిజినెస్ మేన్ సినిమా తన కెరీర్ లో మరిచిపోలేని సినిమా, ఈ ప్రాజెక్టులో నాకు స్థానం కల్పించినందుకు మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కు చాలా థాంక్స్ అంటోంది ఈ భామ. ఈ సినిమాలో తాను చేసిన పాత్రకు ఎన్నో ప్రశంసలు వచ్చాయని, మరిచిపోలేని మంచి అనుభూతి అని చెప్పుకొచ్చింది.

బిజినెస్ మేన్ సినిమా తర్వాత కాజల్ పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ తో తీయబోయే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. తమిళంలో మాట్రాన్, తుపాకి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. క్రితం సంవత్సరం వరస పరాజయాలతో పెయిల్యూర్ హీరోయిన్ గా ముద్రవేయించుకున్న ఈమె ఈ సంవత్సరం తనకు పూర్తిగా కలిసివస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది.

Monday, February 20, 2012

pawan-targets-which-tv-channel


హాట్ టాపిక్: పవన్ టార్గెట్ ఏ టీవీ ఛానెల్ ?


పవన్ కళ్యాణ్ త్వరలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు గా కనిపించనున్న సంగతి తెలిసిందే. కెమెరామెన్ గంగతో రాంబాబు అనే టైటిల్ తో పూరీ జగన్నాధ్ రూపొందించే ఈ చిత్రం ఏ టీవీ ఛానెల్ ని టార్గెట్ చేయనున్నారనే విషయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ సర్కిల్స్ లో నే కాక మీడియా సర్కిల్స్ లో కూడా ఈ విషయమై తీవ్రంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి.

గతంలో పవన్ కళ్యాణ్ ని మాటల్ని వక్రీకరించి నెగిటివ్ గా ఓ ఛానెల్ చూపించిందని దానిపై ద్వజమెత్తనున్నారనే రూమర్స్ గుప్పుమంటున్నాయి. అయితే గతంలోనూ పూరీ తన సినిమాల్లో మీడియాను ఓ రేంజిలో ఏకి పారేయటంతో ఇప్పుడు కూడా అదే ఘాటుతో విరుచుకుపడతాడా అంటున్నారు. నేనింతే తరహాలో పూర్తిగా ఓ వర్గాన్ని టార్గెట్ చేసి డైలాగులు రాసాడని చెప్పుకుంటున్నారు. ఇక మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

mahesh-babu-comments-on-six-pack


సిక్స్ ప్యాక్ పై మహేష్ బాబు కామెంట్


సిక్స్‌ప్యాక్‌ కోసం ప్రయత్నించాను. ముఖం అదోలా తయారైంది. ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టేశాను. ఫ్యూచర్‌లో ట్రై చేస్తానేమో అన్నారు మహేష్ బాబు. ఆయన్ని మీడియా వారు సిక్స్ ప్యాక్ చేయబోతున్నారని విన్నాము అంటే దానికి అలా స్పందించారు. అలాగే రకరకాల విషయాలపై తన అభిప్రాయాలు చెప్తూ...నేను ఇక్కడ థియేటర్లలో సినిమా చూడను. సినిమాలు చూడటానికి ముంబై వెళ్తాను. నాకు నచ్చిన సినిమాలన్నీ... ఒక సామాన్య ప్రేక్షకుడిలా చూసి ఎంజాయ్‌ చేస్తాను. అలాగే నేను ఇష్టపడే, సినిమా చేయాలనుకునే దర్శకుల్లో మొదటివ్యక్తి మణిరత్నం. అలాగని నాకు రీమేక్‌లు నచ్చవు అన్నారు.

ఇక సినిమాల్లో ఇన్వాల్వమెంట్ గురించి మాట్లాడుతూ..సినిమాకి సంబంధించిన చర్చల్లోగానీ సెట్స్‌లోగానీ... నేను నా క్యారెక్టర్‌ ఒక్కటే చూసుకుంటాను. మిగతా విషయాల్లో తలదూర్చను అని తేల్చి చెప్పారు. అలాగే నేను గతాన్ని పట్టించుకోను. వర్తమానంలో బతకడానికే ఇష్టపడతాను. దేవుణ్ణి నమ్ముతాను. పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాను. తిరుపతి వెంకటేశ్వరస్వామిని ఎక్కువగా దర్శించుకుంటాను. మన దేవాలయాలూ పుణ్యక్షేత్రాల్లో ఏదో మహత్తు ఉంది. అక్కడకు వెళ్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే త్వరలో సుకుమార్ దర్సకత్వంలో రూపొందే చిత్రం కూడా షూటింగ్ ప్రారంభం కానుంది.

rachcha-audio-launch-on-march-4


మార్చి 4.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పండగ

వచ్చే నెల(మార్చి) 4 వ తేదీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పండుగ రోజు కానుంది. ఆ రోజునే రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఆడియోని విడుదల చేయటానకి తేదీ ఖరారు చేసారు. ఆ రోజు నుంచే పబ్లిసిటీ క్యాంపైన్ ప్రారంభం కానుంది.

ఈ విషయమై నిర్మాత ఎన్ వి ప్రసాద్ మాట్లాడుతూ..కర్నాల్ టౌన్ లో మార్చి నాలుగున ఆడియోని విడుదల చేస్తామని అన్నారు. వేల కొలది అభిమానులు ఆ రోజు నాటికి అక్కడికి చేరుకుంటారని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. గ్రాండ్ గా ఆ ఫంక్షన్ ని చేయటానికి ఎరేంజ్మెంట్స్ గ్రాండ్ స్కేల్ లో చేస్తున్నారు. ఆ రోజు ఇండస్ట్రీలోని టాప్ డైరక్టర్స్ రాజమౌళి, పూరీ జగన్నాధ్, వివి వినాయిక్ హాజరుకానున్నారు. మరి కొంత మంది రామ్ చరణ్ స్నేహ వర్గంలోని హీరోలు కూడా ఈ పంక్షన్ కి హాజరవుతారు. తమిళ టాప్ డైరక్టర్ శంకర్ ని కూడా ఈ పంక్షన్ కి ఆహ్వానించినట్లు సమాచారం.

ఇక హీరోయిన్ తమన్నా, దర్శకుడు సంపత్ నంది, మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ అక్కడ ఎలాగో ఉండనే ఉంటారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మెడికోగా కనిపించనున్నారు. కారు రేసుల బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. అందులో రామ్ చరణ్ పేరు విశ్వం. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

allu-arjuns-fight-sequeses-at-chennai


చెన్నై పోర్టులో అల్లు అర్జున్‌ గొడవ


అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నై పోర్ట్ లో జరుగుతోంది. అక్కడ అల్లు అర్జున్ గొడవపడి ఫైట్ చేసే యాక్షన్‌ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. వీటికి పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం వహిస్తున్నారు.

అక్కడ కలిసిన మీడియాతో ... తమ చిత్రం పోగ్రస్ గురించి నిర్మాత మాట్లాడుతూ.. 'బద్రినాథ్‌'లో పూర్తిస్థాయి యాక్షన్‌ హంగామా చూపించారు అల్లు అర్జున్‌. ఈసారి వినోదం బాట పట్టారు. బన్నీని కొత్త కోణంలో చూపించే కథ ఇది. త్రివిక్రమ్‌ శైలిలోనే సరదాగా సాగిపోతుంది. ప్రేమ, వినోదం, యాక్షన్‌ మేళవించాం. సంభాషణలు ఆకట్టుకొంటాయి. పీటర్‌ హెయిన్స్‌ యాక్షన్‌ ఘట్టాలను రసవత్తరంగా తీర్చిదిద్దుతున్నారు. అవన్నీ మాస్‌ని అలరిస్తాయి. రాజేంద్రప్రసాద్‌ పాత్ర కీలకం. త్వరలో చిత్రం పేరుని అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు.

ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, సమర్పణ: డి.వి.వి.దానయ్య. 

about-srikanth's-devaraya-film


శ్రీకాంత్ 'దేవరాయ'అస్సలు మ్యాటరేంటి?


శ్రీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'దేవరాయ'. దొరబాబుగా, శ్రీకృష్ణ దేవరాయులుగా శ్రీకాంత్ కనిపించే చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ఈ చిత్రాన్ని నానికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''గతం తెలుసుకొన్న మనిషి కథ ఇది. అమలాపురంలో దొరబాబు పేరు చెబితే చాలు... పేకాట రాయుళ్లు పండగ చేసుకొంటారు. ఎందుకంటే మనోడికి ఎప్పుడూ ముక్క తిరిగిందే లేదు. అందుకే దొరబాబుతో ఆడాలి, వాడి జేబులోని డబ్బులన్నీ మన చేతికి అందేయాలి.. అని కాపు కాస్తారు. అదొక్కటే కాదు.. దొరబాబుకు చాలా సరదాలే ఉన్నాయి. ఆ అలవాట్లతో ఇల్లూ వాకిలీ గుల్ల చేసుకొన్నాడు. ఆ తరవాత ఏమైంది? అసలు దొరబాబుకీ రాయలవారి వంశానికీ సంబంధం ఏమిటి? జల్సారాయుడిగా పేరుతెచ్చుకొన్న దొరబాబు గతమేంటి? అనేదే కథలో కీలకం. ఈ విషయాలు తెలియాలంటే 'దేవరాయ' సినిమా చూడాల్సిందే.

రెండు పాత్రల్లో శ్రీకాంత్‌ నటన ఆకట్టుకొంటుంది. ఈ నెలాఖరు నుంచి హైదరాబాద్‌లో మలి దశ చిత్రీకరణ మొదలుపెడతాం. బ్యాంకాక్‌లో రెండు పాటల్ని తెరకెక్కిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది అన్నారు. విదిశ, మీనాక్షిదీక్షిత్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి నానికృష్ణ, కిరణ్‌ జక్కంశెట్టి నిర్మాతలు.

ntr-puri-jagan's-film-muhurtham-fixed


ఎన్టీఆర్- పూరీ చిత్రం ముహూర్తం, రిలీజ్ డేట్ ఖరారు


ఎన్టీఆర్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం ఓకే అయ్యిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంకి చెందిన ముహూర్తం, విడుదల తేదీలను పూరీ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ఓపెన్ చేస్తారు. అలాగే రిలీజ్ ని సంక్రాంతి 2013 రోజున ఫిక్స్ చేసారు. ఈ విషయానికి ఎన్టీఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సంక్రాంతికి బిజినెస్ మ్యాన్ విడుదల చేసి ఘన విజయం సాధించిన పూరీ మళ్లీ సంక్రాంతికి ఎన్టీఆర్ తో హిట్ కొట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే మొదట మహేష్ తో బిజినెస్ మ్యాన్ 2 చిత్రం తీసి సంక్రాంతికి విడుదల చేస్తారని ఊహించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ పూరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక గతంలో పూరీ,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆంధ్రావాలా చిత్రం విడుదలై డిజాస్టర్ అయ్యింది. అ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తాను పవన్ తో చేయాల్సిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం స్క్రిప్టు పూర్తి చేసుకున్నారు. అలాగే ఎన్టీఆర్ తన దమ్ము చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు.

bommarillu-bhaskar-next-film-with-ram


'బొమ్మరిల్లు భాస్కర్' నెక్స్ట్ ఆ హీరోతో ఖరారు


ఆరెంజ్ చిత్రం ప్లాప్ తో లాంగ్ గ్యాప్ తీసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ రంగంలోకి వచ్చారు. ఆయన తాజాగా ఓ స్క్రిప్టు చేసుకుని హీరోని ఒప్పించుకున్నారు. ఆ హీరో రామ్ అని సమాచారం. మొదట అల్లు అర్జున్ కి చెప్పారు. అయ్యితే డేట్స్ ఇవ్వటానికి చాలా టైమ్ పట్టేటట్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళ హీరో కార్తీతోనూ చిత్రం అనుకున్నారు. అయితే ఆరెంజ్ మెగా ప్లాప్ తో అదీ మెటీరియలైజ్ కాలేదు. ఊసరవెల్లి నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రం మే నుంచి ప్రారంభం కానుంది.

ఇక ప్రస్తుతం రామ్.. కరుణాకరన్ దర్సకత్వంలో ఎందుకంటే ప్రేమంట చిత్రం చేస్తున్నారు. అలాగే మరో ప్రక్క వీరూ పోట్ల దర్సకత్వంలోనూ ఓ చిత్రం కమిటయ్యారు. పవన్ కల్యాణ్ తో ఓకే కానీ ప్రాజెక్టుని రామ్ ఓకే చేసి చేస్తున్నారు. త్వరలోనే వీరూపోట్ల చిత్రం కూడా ప్రారంభం కానుంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ చిత్రం ప్యామిలీ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. వినోదానికి ప్రాముఖ్యత ఇస్తూనే కుటుంబవిలువలకు ప్రాధాన్యత ఇచ్చే కథ అని చెప్తున్నారు. ఇక ఈ కథతో మళ్లీ బొమ్మరిల్లు నాటి సక్సెస్ ను పొందుతానని భాస్కర్ ధీమాగా ఉన్నారు.

trisha-struggling-with-ntr


త్రిషను ఇబ్బందిపెడుతున్న ఎన్టీఆర్


ప్రస్తుతం త్రిష జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో నటిస్తోంది. అయితే పొల్లాచిలో జరుగుతున్న షూటింగ్ లో ఆమె చాలా ఇబ్బంది పడుతోంది అంటున్నారు. అక్కడో మాస్ సాంగ్ ని ఎన్టీఆర్,త్రిషలపై చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ వేసే స్పీడు స్టెప్పులకు ఆమె మ్యాచ్ కాలేక నానా యాతన పడుతోందని,టేక్ ల మీద టేక్ లు తింటోందని అంటున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రత్యేకమైన డాన్స్ లతో అదరకొట్టి తన తోటి యంగ్ బ్యాచ్ హీరోలకు పోటి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. దానికి తగ్గట్లుగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్టెప్ప్ లతో అదరకొడుతున్నారు. అయితే త్రిషకు అదే ఇబ్బందిగా మారింది. అతను స్టెప్ లకు మ్యాచ్ చేయటం త్రిషకు పెద్ద ఇబ్బందిగా మారిందిట. అలాగని ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ఆలోచనలో లేరట. ఎలాగైనా తన అబిమానులకు ఈ చిత్రంతో పండగ వాతావరణం క్రియేట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడని చెప్తున్నారు.

ఇక తన పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందని త్రిష చెప్తోంది. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ...నేను ఎన్టీఆర్ తో ఇంతకుముందు రెండు మూడు సార్లు చేయాల్సి వచ్చింది కానీ అవి మెటీరియలైజ్ కాలేదు. ఎన్టీఆర్ తో పనిచేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే బోయపాటి శ్రీను తో కూడా. ఇక ఈ చిత్రం నా పాత్ర.. మూడు రకాలుగా విభిన్నంగా సాగుతుంది. అందులో ఒకటి నేను రెగ్యులర్ గా చేసేది అంది త్రిష. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా ‘దమ్ము’ప్రసక్తి తెస్తున్నారు. ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు.

అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రంలో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే జూ. ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా తాజా చిత్రం ‘దమ్ము’పై కేంద్రీకరిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.

samantha's-success-secret-revealed


‘దూకుడు’ని వదిలించుకున్నా..సమంత


‘దూకుడు’ నా కెరీర్‌లో మరిచిపోలేని సినిమా. అయితే ఆ సినిమా ఇచ్చిన కిక్‌ను ఎప్పుడో వదిలించుకున్నాను అంది సమంత. రీసంట్ గా ఆమె ఓ తమిళ ఛానల్‌కి చెందిన ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ ఇలా స్పందించింది. ఆ ఛానెల్ వాళ్లు ఆమెను మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అని అడిగారు. దానికి ఆమె ఇలా చెప్పుకొచ్చింది. అలాగే హిట్ కొట్టడం కష్టం కాదు. ఆ హిట్ ఇచ్చిన ఇమేజ్‌ని నిలబెట్టుకోవడం కష్టం. దానికి ఎంతో శ్రమించాలి. అందుకే సినిమాలను ఎన్నుకోవడం నుంచి, ప్రతి విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాను. ప్రస్తుతం నా ఆలోచన మొత్తం ‘ఈగ’ పైనే. నా కెరీర్‌లోనే ఇది డిఫరెంట్ మూవీ అంది. ఇక తనకు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నటించడం కష్టం అనిపించటం లేదంటూ..కొంచెం ఇబ్బందిగానే ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం వల్ల కెరీర్ కాస్త సాఫీగా సాగుతోంది అంది. ఇక బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ - గౌతమ్‌మీనన్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో నటించబోతున్నాను. అయితే అది ఇంకా పూర్తిగా ఫైనలైజ్ కాలేదు. సౌత్ సినిమాలకే నా తొలి ప్రధాన్యత. ఇక్కడ ఖాళీ దొరికితేనే అక్కడ చేస్తాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మహేష్ సరసన తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తోంది. అలాగే ఆమె నాని సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ఎటో వెళ్లి పోయింది మనస్సు చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది.

sunil-hikes-remuneration


రాత్రికి రాత్రే పెరిగిన సునీల్ రెమ్యునేషన్


కమిడియెన్ నుంచి సిక్స్ ప్యాక్ పెంచి మరీ యాక్షన్ హీరోగా మారాడు సునీల్. పూల రంగడు విజయంతో సునీల్ తో ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం అతని సిక్స్ ప్యాక్ కి,డాన్స్ లకే దక్కటం అతన్ని సంతోషంలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపధ్యంలో సునీల్ తన రెమ్యునేషన్ ని మూడు కోట్లకు పెంచినట్లు సమాచారం. గతంలో రోజుకు పది నుంచి పదిహేను లక్షలు వసూలు చేసిన సునీల్ తన రెమ్యునేషన్ పెంచి ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. ఎందుకంటే అతను ఇప్పుడు హిట్ లో ఉన్న హాట్ హీరో అని చెప్తున్నారు. యాక్షన్ హీరోలకు తగ్గని విధంగా చేసిన ఫైట్స్,డాన్స్ లు మాస్ ని ఊపేస్తున్నాయి. సినిమాలో కామెడీ కన్నా ఇవే ఎక్కువ పేలాయి. దాంతో ఆ రేంజి రెమ్యునేషన్ ని పెంచటం సమంజసమే అంటున్నారు. ఇక మీడియా మొత్తం పూల రంగడు చిత్రాన్ని సినిమా అంతా సునీల్ మయం. సునీల్ చేసిన ‘వన్ మేన్ షో’ అంటున్నారు. దాంతో రాత్రికి రాత్రే సునీల్‌ని స్టార్ హీరోని చేసేసిందీ సినిమా. దర్శకుడు వీరభద్రంచౌదరి సైతం సునీల్‌పైనే ఎక్కువగా శ్రద్ధ వహించి డిజైన్ చేసి హిట్ కొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ తో సునీల్ చేసిన ఫైట్ సినిమాకే హైలైట్ కావటం ప్లస్ అయ్యింది. దాంతో మూడు సంవత్సరాలు సునీల్ శ్రమ ఇలా వర్కవుట్ అయ్యి అతన్ని మూడు కోట్ల హీరోని చేసింది.

k.raghavendra rao-designing-pawan-carrer


ప్రస్తుతం పవన్ కి గాడ్ ఫాధర్ ఆయనే


పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఫంధా మార్చి ప్రయోగాలను ప్రక్కన పెట్టి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల వైపు ప్రయాణం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మార్పు వెనకాల ఎవరు ఉన్నారు అంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అని వినపడుతోంది. ఆయన పవన్ కళ్యాణ్ కి గాడ్ ఫాధర్ లా వ్యవరిస్తున్నారని చెప్తున్నారు. ఆర్కా మీడియాలో చేసిన పంజా చిత్రం సమయంలో ఆ నిర్మాతల చుట్టమైన రాఘవేంద్రరావుతో పవన్ కి మంచి రాపో పెరిగిందని చెప్తున్నారు. దాంతో ఆయన సూచనల మేరకు అపజయాల నుంచి తప్పించుకోవటానికి కమర్షియల్ సినిమాలు ఒప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. అందులో భాగమే గబ్బర్ సింగ్,కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు అంటున్నారు. ఇక త్వరలో రాజమౌళి,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం కూడా ఈ స్టాటజీలో భాగమే అంటున్నారు. ఇక రాఘవేంద్రరావుకు కమర్షియల్ చిత్రాల దర్శకుడుగా చాలా పేరుంది. గతంలో ఆయన రూపొందించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యి రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం ఆయన నాగార్జున హీరోగా షిర్డీ సాయి చిత్రం చేస్తున్నారు. పవన్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందుతున్న గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Sunday, February 19, 2012

siddardha's-love-failure-success-meet


ఇప్పుడు నా వయస్సు ఎంతంటే..సిద్దార్ధ


హీరోగా, నిర్మాతగా... ఇకపై ఇలాంటి నాణ్యమైన చిత్రాలు మరెన్నో తీస్తానన్న నమ్మకముంది. ఇప్పుడు నా వయసు 32యేళ్లు. 'లవ్‌ ఫెయిల్యూర్‌' చిత్రాన్ని హిందీలోకి కూడా తీసుకెళ్లే ఆలోచన ఉంది అంటున్నారు సిద్దార్ధ. ఆయన హీరోగా చేస్తూ నిర్మించిన చిత్రం 'లవ్‌ ఫెయిల్యూర్‌'మొన్న శుక్రవారం విడుదలైంది. అమలాపాల్‌ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రానికి బాలాజిమోహన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ని సిద్దార్ధ నిర్వహించి ఈ రకంగా స్పందించాడు. అలాగే..విడుదలైన తొలి రోజునే... సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు నాకు చెప్పడం 'బొమ్మరిల్లు' తర్వాత 'లవ్‌ ఫెయిల్యూర్‌'కే జరిగింది అన్నారు సిద్ధార్థ్‌.'ఒక హీరో గానే కాకుండా... ఒక విజయవంతమైన నిర్మాతగానూ నన్ను నిలబెట్టిన చిత్రమిది. పదేళ్ల కాలంలో ఏమేం నేర్చుకొన్నానో అదంతా ఈ సినిమాకోసం ఉపయోగించాను.

నిర్మాణవ్యయం, చిత్రీకరణ రోజులు... ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాను. అందుకే ఇలాంటి ఒక ప్రయోగాత్మక చిత్రం నిర్మించినా విడుదలకు ముందే లాభాల్లో ఉన్నాను. కథలో కొత్తదనం, దానిపై నాకున్న నమ్మకంతోనే ఈ చిత్రాన్ని సొంతంగా విడుదల చేశాను. వ్యతిరేక భావాలున్న పేరుతో సినిమా తెరకెక్కించి విజయాన్ని అందుకోవడం అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది. కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. దర్శకుడిగా బాలాజిమోహన్‌కి ఇది తొలి చిత్రమే అయినా... ఎంచుకొన్న కథాంశం, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం చాలా బాగుంది. అమలాపాల్‌ నటన, తమన్‌ సంగీతం, నీరవ్‌షా కెమెరా పనితనం ఈ చిత్రానికి కలిసొచ్చాయి అన్నారు.

ss.rajamouli's-assistant-direct-nagachaithanya


సునీల్ కి అనుకున్నది నాగచైతన్యతో...

 

ప్రముఖ దర్శకుడు రాజమౌళి అశోసియేట్ కోటి దర్శకత్వంలో త్వరలో నాగచైతన్య నటించనున్నారు. రాజమౌళి చిత్రాలకు చాలా కాలంగా పనిచేస్తున్న కోటి చెప్పిన యాక్షన్ కథకు వెంటనే ఓకే చేసి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కోటి ..నాగార్జున నటించిన రాజన్న చిత్రానికి కూడా పని చేసారు. ఇక కోటి కథతో గతంలో సునీల్ సినిమా చేద్దామని ప్రయత్నించారు. అందుకోసమే ఆయన సిక్స్ ప్యాక్ బాడీని పెంచారు. నెపోలియన్ టైటిల్ తో తెరకెక్కే ఆ చిత్రం బడ్జెట్ ఎక్కువ అవుతుందని అఫ్పట్లో సునీల్ తో విరమించుకున్నారు. ఇప్పుడు అదే సబ్జెక్టుని నాగచైతన్యతో చేయనున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే చేసి యాక్షన్ హీరోగా నిలదొక్కుకోవాలన్న కోరికతో ఉండటంతో ఈ సినిమాని వేరే ఆలోచన లేకుండా ఓకే చేసినట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్య..దేవకట్టా దర్శకత్వంలో ఆటో నగర్ సూర్య చిత్రం చేస్తున్నారు. వీరూ పోట్ల దర్సకత్వంలోనూ ఓ చిత్రం కమిటయ్యారు. అలాగే రాధామోహన్ దర్శకత్వంలో అనుకున్న గౌరవం అనే ప్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం రద్దైనట్లు సమాచారం. త్వరలోనే నాగచైతన్య పూర్తి స్ధాయి యాక్షన్ హీరోగా కనపడనున్నాడన్నమాట.